IIT Ropar: వస్త్ర పరిశ్రమలో నీటి వినియోగానికి కళ్లెం..
Sakshi Education
కొత్త సాంకేతికత అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్తలు వస్త్ర పరిశ్రమలో నీటి వినియోగాన్ని ఏకంగా 90 శాతం వరకూ తగ్గించే వినూత్న హరిత టెక్నాలజీని భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
![IIT Ropar develops](/sites/default/files/images/2023/02/18/air-nano-bubble-technology-1676707918.jpg)
దీనికి ‘ఎయర్ నానో బబుల్’ అని పేరు పెట్టారు. వస్త్ర పరిశ్రమలో నీటి వినియోగం చాలా ఎక్కువ. అద్దకం, బ్లీచింగ్ సహా పలు దశల్లో ఒక కిలో నూలు వస్త్రం ప్రాసెస్ చేయడానికి 200–250 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. దీనివల్ల కలుషిత నీటి సమస్య కూడా ఉత్పన్నమవుతోంది. దీన్ని తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సమస్యపై రోపార్ లోని ఐఐటీ శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. వీరు గాలి, ఓజోన్తో కూడిన నానో బబుల్స్ ఆధారంగా ఈ టెక్నాలజీని సిద్ధం చేశారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 18 Feb 2023 01:41PM