Ramsar sites in India: భారత్లో 54కి చేరిన రామ్సర్ సైట్లు
Sakshi Education
భారతదేశంలో ఇప్పటివరకు 49 రామ్సర్ సైట్లు ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా మరో 5 చిత్తడి నేలలను రామ్సర్ చిత్తడి నేలలుగా గుర్తించినట్టు భారత పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో తమిళనాడులోని పిచవరం మాంగ్రోవ్, పళ్లికరణై చిత్తడి నేల, కరికిలి పక్షుల సంరక్షణా కేంద్రం; మిజోరంలోని పాలా చిత్తడి నేల, మధ్యప్రదేశ్లోని సఖ్యాసాగర్ చిత్తడినేల ఉన్నాయి. వీటితో కలిపి భారత్లో మొత్తం రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య 54కి చేరింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 06 Aug 2022 05:23PM