Skip to main content

HIV/AIDS: ఎయిడ్స్‌ బాధితుల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?

HIV-AIDS

దేశంలో గత పదేళ్లలో 17,08,777 మంది హెచ్‌ఐవీ బారిన పడ్డారని జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ(ఎన్‌ఏసీఓ) సంస్థ వెల్లడించింది. అరక్షిత శృంగారమే ఇందుకు కారణమని పేర్కొంది. కొత్తగా హెచ్‌ఐవీ బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని వివరించింది. 2011–12లో 2.4 లక్షల మందికి హెచ్‌ఐవీ సోకగా, 2020–21 85,268కు తగ్గిందని ఏప్రిల్‌ 24న తెలిపింది. ఎన్‌ఏసీఓ తెలిపిన వివరాల ప్రకారం..

Noise Pollution: నివాస ప్రాంతాల్లో సీపీసీబీ అనుమతించిన శబ్ద కాలుష్య పరిమితి?

  • ఎయిడ్స్‌ బాధితుల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. గత పదేళ్లలో ఏపీలో 3,18,814, మహారాష్ట్రలో 2,84,577, కర్ణాటకలో 2,12,982, తమిళనాడులో 1,16,536, యూపీలో 1,10,911, గుజరాత్‌లో 87,440 హెచ్‌ఐవీ కేసులు బయటపడ్డాయి.
  • 2011–12 నుంచి 2020–21 మధ్య రక్తం ద్వారా 15,782 మందికి హెచ్‌ఐవీ సోకింది.
  • తల్లి నుంచి బిడ్డకు సోకిన కేసులు గత పదేళ్లలో 4,423 బయటపడ్డాయి.
  • 2020 నాటికి 23,18,737 హెచ్‌ఐవీ బాధితులున్నారు. వీరిలో 81,430 మంది పిల్లలు.

హెచ్‌ఐవీ వైరస్‌ ప్రధానంగా రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి ఎయిడ్స్‌కు దారితీస్తుంది. ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేసే ప్రామాణికమైన చికిత్స ఇప్పటిదాకా అందుబాటులో లేదు. 

Carbon Neutral Panchayat: దేశంలోనే తొలి కార్బన్‌ రహిత పంచాయతీ ఏది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఎయిడ్స్‌ బాధితుల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?
ఎప్పుడు : ఏప్రిల్‌ 24
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌
ఎక్కడ    : దేశంలో..
ఎందుకు : అరక్షిత శృంగారం కారణంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 25 Apr 2022 05:32PM

Photo Stories