Skip to main content

Swadesh Darshan: ఏ పథకంలో భాగంగా బౌద్ధ సర్క్యూట్‌ను అభివృద్ధి చేయనున్నారు?

Buddhist Circuit

దేశంలో బౌద్ధ సర్క్యూట్‌ అభివృద్ధికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రూపొందించింది. స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, గుజరాత్‌ రాష్ట్రాలలో బౌద్ధ సర్క్యూట్‌ అభివృద్ధి కోసం రూ.325.53 కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర పర్యాటక శాఖ అక్టోబర్‌ 5న తెలిపింది. దేశంలో కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న పర్యాటక రంగ అభివృద్ధి, పురోగతిలో కీలక పాత్ర పోషించే విదేశీ, దేశీయ పర్యాటకంలో బౌద్ధ పర్యాటకం ఒకటిగా కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా బుద్ధ సర్క్యూట్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వివిధ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

2021, నవంబర్‌ 17 నుంచి 21 వరకు అంతర్జాతీయ బౌద్ధ సమావేశాలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర పర్యాటక శాఖ ప్రణాళికలను ఇప్పటికే అమలుచేస్తోంది.

చ‌దవండి: ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ థీమ్‌ ఏమిటీ?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రూ.325.53 కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు మంజూరు
ఎప్పుడు : అక్టోబర్‌ 5
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, గుజరాత్‌ రాష్ట్రాలలో బౌద్ధ సర్క్యూట్‌ అభివృద్ధి కోసం...

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

Published date : 06 Oct 2021 04:08PM

Photo Stories