Skip to main content

Gold Import Duty Increased: పసిడికి సుంకం దిగుమతి సుంకం 10.75% నుంచి 15 శాతానికి పెంపు

gold import duty increased 10.75 to 15 percent
gold import duty increased 10.75 to 15 percent

బంగారం దిగుమతులపై తాజాగా సుంకాన్ని పెంచింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 10.75 శాతం నుంచి పసిడి దిగుమతుల సుంకాన్ని 15 శాతానికి చేర్చింది. తద్వారా బలపడుతున్న బంగారం దిగుమతులకు తోడు కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌)కు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. దిగుమతి సుంకంలో తాజా మార్పులు జూన్‌ 30 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. జూన్‌ నెలాఖరువరకూ బంగారంపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ 7.5 శాతంగా అమలు కాగా.. ప్రస్తుతం 12.5 శాతానికి పెరిగింది. దీనికి వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌ 2.5 శాతం జత కలుస్తోంది. వెరసి పసిడి దిగుమతుల సుంకం 15 శాతానికి చేరింది. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 02 Jul 2022 05:59PM

Photo Stories