Skip to main content

Covid Cases: భారీగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులు.. దేశంలో ఒకే రోజు 3,095 మందికి క‌రోనా..

దేశంలో కరోనా వైరస్ కేసులు మ‌ళ్లే పెరుగుతున్నాయి.
covid cases in india

గ‌డిచిన‌ 24 గంటల్లో 3,095 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్చి 31న తెలిపింది. ఆరు కొత్త మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ప్ర‌స్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 15,208కి చేరింది. 

గత 24 గంట‌ల్లో తాజా కేసులతో రికవరి రేటు 98.78% తగ్గింది. మరణాల రేటు 1.19%గా ఉంది. గత మార్చి 30నే దేశంలో తాజాగా నమోదైన కేసుల్లో 50% పెరుగుదల కనిపించింది. కాగా, మహారాష్ట్రలో కొత్తగా 694 కొత్త కేసులు, కేరళలో 765 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారుల‌తో మార్చి 31న సమావేశం నిర్వహించనున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మార్చి 29న ఢిల్లీలో 300 కేసులు న‌మోదు కాగా ఇద్ద‌రు చ‌నిపోయార‌ని తెలిపారు. 

Coronavirus: పెరుగుతున్న క‌రోనా కేసుల సంఖ్య‌.. అప్రమత్తత ముఖ్యమ‌న్న మోదీ

Published date : 31 Mar 2023 01:36PM

Photo Stories