Skip to main content

Netanyahu: నెతన్యాహు దంపతులకు ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు దంపతులను కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌కు ఎంపిక చేసింది.

ఇజ్రాయెల్‌లో నెతన్యాహు స్నేహితురాలు, భారతీయ మూలాలున్న మహిళా పారిశ్రామికవేత్త రీనా వినోద్‌ పుష్కామాతోపాటు మరికొందరిని ఈ అవార్డ్‌కు ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జ‌న‌వ‌రి 8 నుంచి జరిగే ప్రవాసీ భారతీయ దివస్‌ వేడుకల్లో వీరికి అవార్డులను ప్రదానం చేస్తారు. సంగీత విభావరి నిర్వాహకులు జుబెన్‌ మెహతా, నటి సోఫియా లోరెన్, ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఐజాక్‌ రాబిన్, మాజీ అధ్యక్షుడు, ప్రధాని షిమోన్‌ పెరీస్ సహా ఈ ఏడాది 21 మందిని ఈ అవార్డుతో సత్కరించనున్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)

Published date : 04 Jan 2023 11:25AM

Photo Stories