Skip to main content

Telecom Sector: బ్రాడ్‌బ్యాండ్‌ సేవల రంగంలో తొలి స్థానంలో ఉన్న సంస్థ?

airtel, jio, bsnl

ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌)ను వెనక్కి నెట్టి రిలయన్స్‌ జియో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. వాణిజ్య పరంగా సేవలు అందుబాటులోకి తెచ్చిన రెండేళ్లలోనే జియోఫైబర్‌ ఈ ఘనతను సాధించింది. ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ రంగంలో రెండు దశాబ్దాలుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధిపత్య స్థానంలో కొనసాగింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) జనవరి 19న వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2021 నవంబర్‌లో 43.4 లక్షల మంది కస్టమర్లతో జియో తొలి స్థానంలో ఉంది. అంత క్రితం నెలలో ఈ సంఖ్య 41.6 లక్షలు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదార్ల సంఖ్య 47.2 లక్షల నుంచి 42 లక్షలకు వచ్చి చేరింది. భారతి ఎయిర్‌టెల్‌కు 40.8 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. 2019 నవంబర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు 86.9 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2021, అక్టోబర్‌లో 79.9 కోట్లు, 2021, నవంబర్‌లో 80.1 కోట్లకు చేరుకుంది.

చ‌ద‌వండి: ఇన్వెస్టర్ల కోసం సెబీ అందుబాటులోకి తెచ్చిన యాప్‌?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బ్రాడ్‌బ్యాండ్‌ సేవల రంగంలో తొలి స్థానం కైవసం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు : జనవరి 19
ఎవరు    : రిలయన్స్‌ జియో 
ఎక్కడ    : దేశంలో..
ఎందుకు : మిగతా సంస్థలతో పోలిస్తే అత్యధిక కస్టమర్లను కలిగి ఉన్నందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 Jan 2022 12:16PM

Photo Stories