Skip to main content

ఇటీవల ఏ దేశానికి చెందిన అధ్యక్షుడు హత్యకు గురయ్యారు?

కరేబియన్‌ దేశమైన హైతి అధ్యక్షుడు జోవెనెల్‌ మోయిజ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
Current Affairs
జూలై 7న పోర్ట్‌–అవ్‌–ప్రిన్స్‌ నగరంలోని ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు జోవెనెల్‌ను కాల్చి చంపినట్టుగా ఆ దేశ తాత్కాలిక ప్రధాని క్లాడ్‌ జోసెఫ్‌ వెల్లడించారు. దుండగుల దాడిలో గాయపడిన అధ్యక్షుడి భార్య, దేశ ప్రథమ మహిళ మార్టిన్‌ మోయిజ్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఎవరు ఈ ఘాతుకానికి ఒడిగట్టారో ఇంకా తెలియలేదు.

53 ఏళ్ల వయసున్న మోయిజ్‌ 2017లో అధికారంలోకి వచ్చారు. అప్పట్నుంచి ఆయన తన అధికారాన్ని పెంచుకునే ప్రయత్నాలే చేశారు. కోర్టులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ఆడిటర్లు, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు కేవలం అధ్యక్షుడికే జవాబుదారీలా ఉండేలా నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఎన్నికలు నిర్వహించడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో అధ్యక్షుడిపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. విపక్ష నేతలు ఆయన గద్దె దిగాలని కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఇటీవల ఏ దేశానికి చెందిన అధ్యక్షుడు హత్యకు గురయ్యారు?
ఎప్పుడు : జూలై 7
ఎవరు : హైతి అధ్యక్షుడు జోవెనెల్‌ మోయిజ్‌
ఎక్కడ : పోర్ట్‌–అవ్‌–ప్రిన్స్‌ నగరం, హైతి
Published date : 08 Jul 2021 06:15PM

Photo Stories