Shreyas Iyer: ఐసీసీ అవార్డు గెలుచుకున్న శ్రేయస్ అయ్యర్

ఈ అవార్డు కోసం శ్రేయస్.. న్యూజిలాండ్కు చెందిన రచిన్ రవీంద్ర, జేకబ్ డఫీతో పోటీపడ్డాడు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తమ ఓట్ల ద్వారా శ్రేయస్ను ప్లేయర్ ఆఫ్ ద మంత్గా (మార్చి) నిర్ణయించారు.
శ్రేయస్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకోవడం ఇది రెండో సారి (2022 ఫిబ్రవరి, 2025 మార్చి). భారత క్రికెటర్లలో శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా (2024 జూన్, 2024 డిసెంబర్) మాత్రమే ఈ అవార్డును రెండు అంతకంటే ఎక్కువ సార్లు గెలుచుకున్నారు. భారత్ తరఫున గిల్ అత్యధికంగా మూడు సార్లు (2023 జనవరి, 2023 సెప్టెంబర్, 2025 ఫిబ్రవరి) ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలిచాడు.
2021 జనవరిలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఐసీసీ ప్రవేశపెట్టగా.. ఇప్పటివరకు ఎనిమిది మంది టీమిండియా క్రికెటర్లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు అమల్లోకి వచ్చిన తొలి మూడు నెలల్లో భారత ఆటగాళ్లే (పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్) ఈ అవార్డు గెలవడం విశేషం.
Sourav Ganguly: ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్గా మళ్లీ సౌరవ్ గంగూలీనే..
ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు గెలుచుకున్న టీమిండియా క్రికెటర్లు..
- శుభ్మన్ గిల్-3
- జస్ప్రీత్బుమ్రా-2
- శ్రేయస్ అయ్యర్-2
- రిషబ్ పంత్-1 (2021 జనవరి)
- రవిచంద్రన్ అశ్విన్-1 (2021 ఫిబ్రవరి)
- భువనేశ్వర్ కుమార్-1 (2021 మార్చి)
- విరాట్ కోహ్లి-1 (2022 అక్టోబర్)
- యశస్వి జైస్వాల్-1 (2024 ఫిబ్రవరి)
Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..!