Skip to main content

ఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా జస్టిస్ నాగార్జునరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్‌పర్సన్‌గా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అక్టోబర్ 30న జరిగిన ఈ కార్యక్రమంలో నాగార్జునరెడ్డితో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ శంకరనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ట్రాన్స్ కో సీఎండీ శ్రీకాంత్, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ పాల్గొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్‌పర్సన్‌గా ప్రమాణం
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : హెకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Published date : 31 Oct 2019 05:30PM

Photo Stories