Skip to main content

ఏపీ ఈబీసీ కార్పొరేషన్ ఎండీగా సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా డిప్యూటీ కలెక్టర్ వైఎస్‌వీకేజీఎస్‌ఎల్ సత్యనారాయణరావు నియమితులయ్యారు.
ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ సెప్టెంబర్ 13న ఉత్తర్వులు జారీ చేశారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డెరైక్టర్ బీ రామారావు ఇప్పటివరకు ఈబీసీ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏపీ ఈబీసీ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : వైఎస్‌వీకేజీఎస్‌ఎల్ సత్యనారాయణరావు
Published date : 14 Sep 2019 05:29PM

Photo Stories