Skip to main content

Desh ke Mentor: దేశ్‌ కా మెంటార్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న నటుడు?

ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌ అందించేందుకు చేపట్టిన ‘దేశ్‌ కా మెంటార్‌’ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.
ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆగస్టు 27న ప్రకటించారు. ఢిల్లీలోని సర్కారు స్కూళ్ల విద్యార్థులకు తమ శక్తి సామర్థ్యాలను వెలికితీసే మెంటార్‌ను గుర్తించేందుకు ‘దేశ్‌ కా మెంటార్‌’ సాయపడనుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉండే మెంటార్లు విద్యార్థుల కెరీర్‌ సంబంధిత ప్రశ్నలకు పరిష్కారాలు కనుగొం టారు. ఇందులో భాగంగా ఒక్కో మెంటార్‌ విద్యార్థుల కోసం వారంలో 10 నిమిషాల సమయం కేటాయించాల్సి ఉంటుంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : దేశ్‌ కా మెంటార్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న సినీ నటుడు?
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : సోనూ సూద్‌
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : ఢిల్లీలోని సర్కారు స్కూళ్ల విద్యార్థులకు తమ శక్తి సామర్థ్యాలను వెలికితీసే మెంటార్‌ను గుర్తించడంలో భాగంగా...
Published date : 28 Aug 2021 06:07PM

Photo Stories