Skip to main content

దక్షిణ కొరియాకు చెందిన ఏ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది?

దక్షిణ కొరియాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సోషల్ ఇంటిగ్రేషన్ అండ్ హెచ్‌ఆర్ డెవలప్‌మెంట్ (క్రెసిహెచ్‌ఆర్డీ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
Current Affairs
ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి సమక్షంలో నవంబర్ 25న క్రెసిహెచ్‌ఆర్డీ చైర్మన్ డాంగ్ యోప్ కిమ్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేశారు.

ఒప్పందం ద్వారా...
తాజా ఒప్పందం ద్వారా ఆరోగ్యకరమైన మానవ వనరులను సమాజానికి అందించడానికి అవకాశం కలుగుతుంది. విశ్వవిద్యాలయ పాఠ్యాంశాల్లో కొరియన్ లాంగ్వేజ్, విదేశీ విశ్వవిద్యాలయ మార్పిడి కార్యక్రమాలు, పరిశ్రమ ఇంటర్న్‌షిప్‌లు కూడా ఎంవోయూలో భాగంగా ఉన్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సోషల్ ఇంటిగ్రేషన్ అండ్ హెచ్‌ఆర్ డెవలప్‌మెంట్ (క్రెసిహెచ్‌ఆర్డీ)తో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి
ఎందుకు : ఆరోగ్యకరమైన మానవ వనరులను సమాజానికి అందించడానికి
Published date : 26 Nov 2020 06:07PM

Photo Stories