Skip to main content

Vande Bharat Trains: మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు కొత్త వందే భారత్ రైళ్లను ఆగస్టు 31వ తేదీ జెండా ఊపి ప్రారంభించారు.
PM Modi to flag off three Vande Bharat Trains on 31st August

మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్-లక్నోల మధ్య ఆగ‌స్టు 31వ తేదీ నుంచి వందేభారత్‌ రైలు పరుగులు తీయనుంది. మీరట్-లక్నో-మీరట్(22490/22491) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు, రాకపోకల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది.
 
లక్నో-మీరట్(22491), మీరట్-లక్నో(22490) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల రెగ్యులర్ ఆపరేషన్ సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. 

ఈ కొత్త వందే భారత్ రైళ్లు ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అనే మూడు రాష్ట్రాలకు సేవలు అందీయ‌నున్నాయి. దేశంలోని 280 జిల్లాలను కలుపుతున్న 100కు పైగా సెమీ హైస్పీడ్ రైళ్లలో ఈ కొత్త రైళ్లు చేరనున్నాయి.  

Railway Projects: రూ.6,456 కోట్ల.. రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ఈ రైలు మీరట్-లక్నో మధ్య మొరాదాబాద్, బరేలీ జంక్షన్‌లలో మాత్రమే ఆగుతుంది. ఈ రైలుకు సంబంధించిన బుకింగ్ ప్రారంభమైన నేపధ్యంలో సెప్టెంబర్ 5 తర్వాత తేదీల ప్రయాణం కోసం సీట్లు వేగంగా బుక్ అవుతున్నాయి.

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మూడు మార్గాల్లో (మీరట్-లక్నో, మదురై-బెంగళూరు, చెన్నై-నాగర్ కోయిల్) కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. 

Published date : 31 Aug 2024 06:48PM

Photo Stories