Skip to main content

High Court: ట్రాన్స్‌ఫర్మేటివ్‌ జస్టిస్‌ పుస్తకాన్ని ర‌చించిన‌ విశ్రాంత న్యాయమూర్తి?

Transformative Justice

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ శివశంకరరావు రచించిన ‘ట్రాన్స్‌ఫర్మేటివ్‌ జస్టిస్‌’ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీజే అరూప్‌ కుమార్‌ గోస్వామి ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా, మంగళగిరిలో సెప్టెంబర్‌ 23న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్‌ గోస్వామి మాట్లాడుతూ... న్యాయవాదులు, న్యాయమూర్తులకు ఉపయుక్తంగా జస్టిస్‌ డాక్టర్‌ బులుసు శివశంకరరావు మరిన్ని పుస్తకాలు రచించాలని ఆకాంక్షించారు. న్యాయవ్యవస్థలోని వివిధ అంశాలను వివరణాత్మకంగా ఈ పుస్తకం ద్వారా అందించారన్నారు. ఏపీ టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన కమిటీ(జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిటీ) చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి. శివశంకరరావు 2019, సెప్టెంబర్‌ 14న బాధ్యతలు స్వీకరించారు.

చ‌ద‌వండి: రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న తొలి సాంకేతిక నిపుణులు?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ శివశంకరరావు రచించిన ‘ట్రాన్స్‌ఫర్మేటివ్‌ జస్టిస్‌’ పుస్తకావిష్కరణ
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 23
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీజే అరూప్‌ కుమార్‌ గోస్వామి
ఎక్కడ    : మంగళగిరి, గుంటూరు జిల్లా

Published date : 25 Sep 2021 01:31PM

Photo Stories