న్యూఢిల్లీ: 10, 12వ తరగతి బోర్డ్ పరీక్ష పత్రాలు లీకయ్యాయంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని Central Board of Secondary Education (CBSE) ఫిబ్రవరి 27న విద్యార్థులు, తల్లిదండ్రులను కోరింది.
ప్రశ్నపత్రాల లీకేజీ వార్తలను నమ్మొద్దు
ఈ పుకార్లకు కారకులని తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పేపర్ లీకైందని, 2023 పరీక్షా పత్రాలు అందుబాటులో ఉన్నాయంటూ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీబీఎస్ఈ సభ్యుడొకరు తెలిపారు.
‘ఇలాంటి పుకార్లతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి డబ్బులు గుంజేందుకు కొందరు వ్యక్తులు, సమూహాలు, సంస్థలు పథకం వేస్తున్నాయి. బాధ్యతారాహిత్య చర్యలు, అయోమయం, భయాందోళనలకు పురిగొల్పే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి’అని పేర్కొన్నారు.