ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. సెలీనా గుంటూరు ఏసీ కాలేజీ పూర్వపు ప్రిన్సిపాల్ బి.చంద్రపాల్ కుమార్తె. ఆమె డిగ్రీ కళాశాల లెక్చరర్గా పనిచేస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అకడమిక్ విభాగంలో డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. ఇంగ్లిషులో డాక్టరేట్ డిగ్రీ కలిగి ఉన్నారు. తనను కమిషన్ సభ్యురాలిగా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సెలీనా కృతజ్ఞతలు తెలిపారు.