Skip to main content

సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో.. గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఉద్యోగ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్రంలో గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఉద్యోగాల భర్తీకి త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.
Free Awareness Seminar on Group I and Group II Job Examinations

 ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ విద్యార్థులను గ్రూప్‌–1, గ్రూప్‌–2 స్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ (www.sakshieducation.com) రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత అవగాహన సదస్సులు నిర్వహించనుంది. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ తోడుగా ఉంటున్న విషయం మీ అందరికీ తెలిసిందే.

చదవండి: Deputy Collector Success Story : ఓట‌మి నుంచి వ‌చ్చిన క‌సితోనే చ‌దివా.. గ్రూప్‌-1 ఉద్యోగం కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యానిలా..

ఎంతో మందిని పోటీ పరీక్షల్లో విజేతలుగా తీర్చిదిద్దుతున్న సివిల్స్‌ బోధన నిపుణురాలు బాలాలత గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఉద్యోగ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సుకు గెస్ట్‌ స్పీకర్‌గా హాజరు కానున్నారు. ఆమె అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెల్‌: 89776 25795 నంబరుకు తమ పేరు, ఫోన్‌ నంబర్‌, జిల్లా వివరాలు వాట్సాప్‌లో పంపగలరు.

వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్‌ : 89776 25795

వేదిక : ఈ నెల 18న కాకినాడలో..
గెస్ట్‌ స్పీకర్‌ : ప్రముఖ సివిల్స్‌ ఫ్యాకల్టీ బాలాలత
లక్ష్యం : గ్రామీణ, పట్టణ విద్యార్థులకు గ్రూప్‌–1, గ్రూప్‌–2 పరీక్షలపై అవగాహన కల్పించడం

వేదిక: దంటు కళాక్షేత్రం, మున్సిపల్‌ ఆఫీసు వెనుక, గాంధీ భవన్‌ పక్కన, కల్పనా సెంటర్‌, కాకినాడ
సమయం: ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకూ..
 

Published date : 29 Nov 2023 04:21PM

Photo Stories