సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్ కాలేజీలలోని విద్యార్థులు, లెక్చరర్లకు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘం (ఏపీఎన్నార్టీఎస్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ఫిబ్రవరి 21న ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంటర్మీడియెట్ విద్యార్థులు, లెక్చరర్లకు నైపుణ్య శిక్షణ
ఈ ఒప్పందం ప్రకారం విద్యార్థులు, లెక్చరర్లకు ఎన్ఆర్ఐ డాక్టర్లు, వర్చువల్ విధానంలో శిక్షణ ఇస్తారని పేర్కొంది. నైపుణ్యాల పెంపుతో పాటు పరీక్ష సమయంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడానికి నిపుణులు శిక్షణ ఇస్తారని తెలిపింది. ఈ శిక్షణ ఒక్కో కాలేజీ నుంచి ఇద్దరు చొప్పున 6,800 మందికి ఇవ్వనున్నట్లు పేర్కొంది.