సాక్షి ఎడ్యుకేషన్ : శ్రీకాకుళం ఆర్జీయూకేటీ (రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) క్యాంపస్లో ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) మొదటి ఏడాదికి సంబంధించి ప్రవేశాల కౌన్సెలింగ్ సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నారు.
RGUKT 2023 Counselling
ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మెరిట్ జాబితా మేరకు 1100 మంది విద్యార్థులకు కాల్ లెటర్లు పంపించారు. వీరంతా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. దూర ప్రాంత విద్యార్థులు చాలా మంది ఆదివారం సాయంత్రానికి ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు చేరుకోగా, అధికారులు వసతి కల్పించే ఏర్పాట్లు చేశారు.