Skip to main content

APNRTS: పరీక్షల భయం ఉండదిక

సాక్షి, అమరావతి: పరీక్షల భయంతో కలిగే మానసిక ఒత్తిడిని విద్యార్థులు అధిగవిుంచేలా చేయడంపై ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్టిఎస్‌) దృష్టి సారించింది.
APNRTS
పరీక్షల భయం ఉండదిక

ఇందుకోసం బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌తో కలిసి ప్రవాస వైద్యులు, నిపుణులతో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని లెక్చరర్లకు ‘లైఫ్‌ స్కిల్స్‌–స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌’ పేరిట శిక్షణ ఇస్తోంది. ఆ అధ్యాపకులు తమ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఇంటరీ్మడియెట్‌ పరీక్షల సమయంలో విద్యార్థులు అధిక ఒత్తిడికి గురవుతున్నారని, దానిని ఎలా అధిగవిుంచవచ్చనే విషయాన్ని వివరించేందుకు వర్చువల్‌గా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఏపీఎన్‌ఆరీ్టఎస్‌ అధ్యక్షుడు వెంకట్‌ ఎస్‌ మేడపాటి ఫిబ్రవరి 16న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి కాలేజీ నుంచి ఇద్దరు చొప్పున 10,200 మంది (ప్రభుత్వ కాలేజీల నుంచి 3,400 మంది, ప్రైవేట్‌ కాలేజీల నుంచి 6,800 మంది) లెక్చరర్లను ఎంపిక చేశామని పేర్కొన్నారు.

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్

విద్యార్థులను మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయడానికి అవలంబించాల్సిన విధానాలపై వారికి శిక్షణ ఇస్తున్నామని వివరించారు. ఇప్పటికే 50 శాతం కళాశాలల్లో శిక్షణ పూర్తయిందని, ఫిబ్రవరి 22 వరకు కొనసాగుతుందని తెలిపారు. శిక్షణ పూర్తయిన లెక్చరర్లు తమ కాలేజీల్లోని విద్యార్థులకు ఒత్తిడి అధిగవిుంచడంపై కౌన్సెలింగ్‌ ఇస్తారని పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అమెరికాలోని అల్బమాకు చెందిన సర్టిఫైడ్‌ చైల్డ్‌ అండ్‌ అడా­లెసెంట్‌ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ అపర్ణ ఉప్పల, ఎస్‌పీఐఎఫ్‌ వ్యవస్థాపకుడు నెల్సన్‌ వినోద్‌ మోజెస్‌ (మెంటల్‌ హెల్త్‌ జర్నలిస్ట్‌ విభాగంలో అవార్డ్‌ గ్రహీత)తోపాటు ప్రముఖ యాంకర్, సినీనటి ఝాన్సీ తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు. 

Published date : 17 Feb 2023 03:36PM

Photo Stories