Skip to main content

Open schools: 18 నుంచి ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

రాయవరం: ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఈ నెల 18 నుంచి 23 వరకు జరగనున్నాయి.
Open schools
Open schools

ఉదయం, మధ్యాహ్నం వీటిని నిర్వహించనున్నారు. విద్యార్థులు హాల్‌ టిక్కెట్లు జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. అక్రిడిడేటెడ్‌ ఇనిస్టిట్యూట్స్‌(ఎ.ఐ) స్టడీ సెంటర్ల ద్వారా విద్యార్థులకు అందించనున్నట్లు ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ పి.సాయివెంకటరమణ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,683 మంది విద్యార్థులు ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. కాకినాడ జిల్లా నుంచి 3,045, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నుంచి 2,553, తూర్పుగోదావరి జిల్లా నుంచి 2,085 మంది ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు.

Published date : 13 Apr 2023 08:38PM

Photo Stories