ఒంగోలు సబర్బన్: పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు సకాలంలో హాల్టికెట్లు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి
ఈ మేరకు ఆమె మిర్చి 14న ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు స్కూళ్లు, ఇంటర్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులు ఫీజులు చెల్లించలేదంటూ హాల్టికెట్లు ఇవ్వడం లేదని కమిషన్కు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశామన్నారు. హాల్టికెట్లు ఇవ్వకపోతే విద్యార్థులు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 7635కు ఫిర్యాదు చేయాలని సూచించారు.