Skip to main content

Jagananna Vidya Kanuka: నూరుశాతం విద్యాకానుక అందించాలి: ప్రవీణ్‌ ప్రకాష్‌

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ నూరుశాతం జగనన్న విద్యా కానుకను అందజేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అధికారులను ఆదేశించారు.
Jagananna Vidya Kanuka
నూరుశాతం విద్యాకానుక అందించాలి: ప్రవీణ్‌ ప్రకాష్‌

ఈ విద్యా సంవత్సరంలో జేవీకే వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధన సంస్థలు ఉపయోగించే బేయస్‌ సెంట్రల్‌ లిమిట్‌ థియరీమ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ విధానంలో సర్వే చేసినట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 87 నుంచి 91 శాతం మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లు అందాయని, 84 శాతం మంది కొత్త యూనిఫారం కుట్టించుకుని ధరిస్తున్నట్లు తేలిందన్నారు. రోజూ 90 నుంచి 94 శాతం మంది విద్యార్థులు బూట్లు ధరిస్తున్నారన్నారు.  

చదవండి:

School Education Department: ‘ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ సేవలు వినియోగించుకోండి’

JVK: మేనమామ మేలిమి ‘కానుక’

Published date : 04 Jul 2023 05:25PM

Photo Stories