TS Gurukul CET 2024: విద్యార్థులు నిబంధనలు పాటించాలి
ఏటూరునాగారం: ఏటూరునాగారం గురుకుల డిగ్రీ గిరిజన బాలికల కళాశాలలో ఫిబ్రవరి 11వ తేదీన జరిగే 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షకు వచ్చే విద్యార్థులు నిబంధనలు పాటించాలని కళాశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి ఫిబ్రవరి 9న ఒక ప్రకటనలో తెలిపారు.
205 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అవుతారన్నారు. విద్యార్థులు వాటర్ బాటిల్, పరీక్ష ప్యాడ్, బ్లాక్, బ్లూ బాల్ పెన్, ఆధార్ కార్డు, హాల్టికెట్ వెంట తీసుకుని ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 10 గంటలలోపు కళాశాలకు చేరుకోవాలన్నారు. వివరాలకు 7901097696, 99517 55806, 9533781812 నంబర్లను సంప్రదించాలన్నారు.
చదవండి:
TREIRB Gurukulam Results Out: ‘గురుకుల’కు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
#Tags