Job Mela: ఐటీఐ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రేపు జాబ్‌మేళా

అనంతపురం: స్థానిక ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఈ నెల 27న జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ రామమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం సమీపంలోని అమర్ రాజా ఎనర్జీ మొబిలిటి లిమిటెడ్ కంపెనీలో టెక్నీషియన్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.

Fake Universities: ఆ యూనివర్సిటీలు నకిలీవని తేల్చిన యూజీసీ.. వాటిలో డిగ్రీలు చెల్లవు

ఐటీఐ పూర్తి చేసిన వారితో పాటు చివరి సంవత్సరం పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఎంపికైన అభ్యర్థులకు భోజనం, వసతితో పాటు నెలకు రూ.14,000/- వేతనం చెల్లించనున్నారు. మరిన్ని వివరాల కోసం: 88868 85173 నంబర్‌లో సంప్రదించండి.

ముఖ్యమైన అంశాలు:

ఉద్యోగాలు: అమర్ రాజా ఎనర్జీలో టెక్నీషియన్
అర్హత: ఐటీఐ పూర్తి చేసిన వారు లేదా చివరి సంవత్సరం విద్యార్థులు

ఎక్కడ: అనంతపురం ప్రభుత్వ బాలుర ఐటీఐ
ఎప్పుడు: ఈ నెల 27

వేతనం: నెలకు రూ.14,000/-
సదుపాయాలు: భోజనం, వసతి

#Tags