GATE 2024 Top Ranker : గేట్‌-2024 ఫ‌లితాల్లో సాయికృష్ణకు జాతీయ‌ స్థాయిలో 10వ ర్యాంక్‌..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎంటెక్‌లో ప్రవేశం కోసం నిర్వహించే గేట్‌-2024 పరీక్షల్లో జాతీయ‌ స్థాయిలో 10వ ర్యాంక్‌ సాధించిన కఠెవరం విద్యార్థి యర్రు లక్ష్మీ సాయికృష్ణను తెనాలి స్వచ్ఛంద సేవా సంస్థ మానవత ఆధ్వర్యంలో ఘ‌నంగా సత్కరించారు.

గుంటూరు జిల్లా తెనాలిలోని కఠెవరంకు చెందిన‌ విద్యార్థి నివాసానికి సంస్థ తెనాలి చైర్మన్‌ డాక్టర్‌ కొలసాని రామ్‌చంద్‌ సాయికృష్ణను సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. అతడి విజయం తెనాలికి గర్వకారణమన్నారు. 

మానవత ఎగ్జిక్యూటీవ్‌ ప్రెసిడెంట్‌ కల్యాణి రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ.. సాయికృష్ణ విజయం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. వీఎల్‌ఎస్‌ఐ టెక్నాలజీ అనుభవంతో స్వయంగా ఒక సంస్థను నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పించాలనేది తన భావనగా సాయికృష్ణ వెల్లడించారు.

#Tags