Squash Championship: భారత్‌కు ప్రపంచ జూనియర్ స్క్వాష్‌లో కాంస్యం!

ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కాంస్య పతకం లభించింది.

18 ఏళ్ల శౌర్య బావా అండర్-19 బాలుర సింగిల్స్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు.

జూలై 17వ తేదీ జరిగిన సెమీఫైనల్లో ఢిల్లీకి చెందిన శౌర్య 5-11, 5-11, 9-11 తో టాప్ సీడ్, గత ఏడాది రన్నరప్ మొహమ్మద్ జకారియా (ఈజిప్ట్) చేతిలో ఓడిపోయాడు.
 
2014లో కుశ్ కుమార్ తర్వాత ఈ మెగా టోర్నీలో పతకం నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్‌గా శౌర్య గుర్తింపు పొందాడు.

Gareth Southgate: పుట్‌బాల్ జట్టు కోచ్ పదవికి రాజీనామా చేసిన సౌత్‌గేట్‌!

#Tags