Ashok Gehlot: ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే సిలిండర్‌

కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం కింద లబ్ధిపొందే రాష్ట్రంలోని పేదలకు రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటించారు.

ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఏడాదికి 12 సిలిండర్లు ఈ ధరకే అందిస్తామ‌ని తెలిపారు. ‘ఉజ్వల పథకం కింద ప్రధాని మోదీ పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు అయితే ఇచ్చారుగానీ ధరలు రూ.400 నుంచి ఏకంగా రూ.1,040కి పెరగడంతో ఎవరూ కొత్తగా సిలిండర్లు బుక్‌చేయడం లేదు. రాష్ట్రంలో ఇకపై ఉజ్వల పథకం లబ్దిదారులైన దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదలకు రూ.500కే ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తాం’ అని గెహ్లాట్‌ చెప్పారు.

Weekly Current Affairs (National) క్విజ్ (18-24 నవంబర్ 2022)

#Tags