Andhra Pradesh: వర్షాల కారణంగా దేహదారుఢ్య పరీక్షల వాయిదా... మరి ఎప్పుడు...?
గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం జరగాల్సిన ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను ఒక్క రోజు వాయిదా వేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం కారణంగా వాయిదా వేసినట్టు తెలిపారు. ఈ నెల 25న పరీక్షలు జరగాల్సిన వారికి సెప్టెంబర్ 16న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి ఎస్ఐ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతాయని ఐజీ వివరించారు.
పోలీస్ పరేడ్ గ్రౌండ్ను పరిశీలించిన ఎస్పీ
సాక్షి: స్థానిక నగరంపాలెంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ను జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్హఫీజ్ పరిశీలించారు. గ్రౌండ్లో ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు జరగనున్న దృష్ట్యా వర్షాల వేళల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. విధుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ (ఏఆర్) కె.కోటేశ్వరరావు, డీఎస్పీలు చంద్రశేఖర్, బాలసుందరరావు, రేంజ్ ఐజీ కార్యాలయపు సీఐ సుధాకర్, సీఐలు, ఆర్ఐలు పాల్గొన్నారు.
#Tags