AP Inter Results 2024 Updates : ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 విడుదలపై బోర్డ్ కీలక ప్రకటన..
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల విడుదలపై బోర్డ్ కీలక ప్రకటన చేసింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 11:00 గంటలకు విడుదల చేయనున్నారు.
తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఈ పలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాల కోసం ఎంతో మంది ఇంటర్ విద్యార్థులు, వీరి తల్లిదండ్రులు ఉత్కఠంగా ఎదురుచూస్తున్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా..
ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.ఇంటర్మీడియట్లో రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాశారు. ఒకే ఒక క్లిక్తోనే.. అందరి కంటే ముందుగానే.. ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల 2024 ఫలితాలను www.sakshieducation.com లో చూడొచ్చు. అలాగే ఫలితాల విడుదల అనంతరం ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా వెల్లడించనున్నారు.
#Tags