Telangana University: పీజీ పరీక్షల్లో 57 మంది గైర్హాజరు
Sakshi Education
![telangana university pg exam](/sites/default/files/images/2024/02/27/telangana-university-1709021388.jpg)
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎంబీఏ, ఎంసీఏ, ఐఎంబీఏ రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన పరీక్షకు 57 మంది గైర్హాజరైనట్లు పరీక్షల నియంత్రణాధికారి (కంట్రోలర్) ప్రొఫెసర్ ఎం అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఎంబీఏ, ఎంసీఏ, 2వ సెమిస్టర్, ఐఎంబీఏ 8వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో 620 మంది విద్యార్థులకు గానూ 578 మంది హాజరు కాగా 42 మంది గైర్హాజరైనట్లు కంట్రోలర్ తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ఎంబీఏ, ఎంసీఏ 4వ సెమిస్టర్, ఐఎంబీఏ 10వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలకు 319 మంది విద్యార్థులకు గానూ 304 మంది హాజరు కాగా 15 మంది గైరాజరైనట్లు కంట్రోలర్ తెలిపారు.
Published date : 25 Jul 2023 03:25PM