AP Govt School Students: జాతీయ రెజ్లింగ్ పోటీలకు ఎల్హెచ్ఆర్ విద్యార్థులు
![AP Govt School Students for National Wrestling Competition](/sites/default/files/images/2023/09/26/national-wrestling-competition-1695733231.jpg)
మైలవరం: జాతీయ రెజ్లింగ్ పోటీలకు మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కె.కనకదుర్గ సోమవారం తెలిపారు. స్థానిక డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎం.జయరత్న అండర్–14 విభాగంలో 63 కిలోల కేటగిరిలో గోల్డ్ మెడల్ సాధించి జాతీయ పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. బి.మౌనిక అండర్–14 బాలికల విభాగంలో 41 కిలోల కేటగిరిలో రాష్ట్ర స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించినట్లు ఇన్చార్జి హెచ్ఎం కనకదుర్గ తెలిపారు. ఈ నెల 21 నుంచి 23 వరకు నున్న వికాస్ ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు జరిగాయన్నారు. బంగారు పతకం సాధించిన జయరత్న అక్టోబర్లో మహారాష్ట్రలోని విదిశాలో జరిగే జాతీయ పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తాడని ఇన్ చార్జి హెచ్ఎం కనకదుర్గ తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులను, వ్యాయామోపాధ్యాయుడు కె.వెంకయ్యను పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.