వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో అన్యాయం.. నోటిఫికేషన్ సవరనకు వినతి!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరుగుతోందని ఇంటర్ వొకేషనల్ డెయిరీ కోర్సు ఉత్తీర్ణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఈనెల 21న టీఎస్పీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లో తమకు అర్హత కల్పించకపోవడం భావ్యం కాదని వారంటున్నారు.
![](/sites/default/files/images/2020/07/27/TSPSC_Logo.jpg)
2013లో వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తమతో పాటు ఎంపీవీఏ కోర్సు పూర్తి చేసిన వారు కూడా అర్హులేనని వారు చెబుతున్నారు. ఈ జీవో ప్రకారమే 2017 లో నోటిఫికేషన్ నం: 30/17 జారీ చేసి వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేశారు. ఈ నోటిఫికేషన్లో తమకు కూడా అవకాశం కల్పించారని, కానీ తాజా నోటిఫికేషన్ నం: 06/2020 ప్రకారం తమకు అవకాశం కల్పించడం లేదని తెలంగాణ వొకేషనల్ డెయిరీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. నోటిఫికేషన్ సవరించి తమకు కూడా అర్హత కల్పించాలని అసోసియేషన్ నేతలు టీఎస్పీఎస్సీ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.
Published date : 27 Jul 2020 01:10PM