Skip to main content

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్ ఎంపిక‌..కొత్త బాస్ ఎవ‌రంటే?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా బి. జనార్ధన్‌రెడ్డి నియమితులయ్యారు.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మే 19వ తేదీన‌ ఉత్తర్వులు జారీ చేసింది. జనార్దన్‌రెడ్డితోపాటు ఏడుగురు సభ్యులను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రమావత్‌ ధన్‌సింగ్‌, కోట్ల అరుణకుమారి, లింగారెడ్డి, ఆర్‌.సత్యనారాయణ, ఆరవెల్లి చంద్రశేఖర్‌రావు, సుమిత్ర ఆనంద్‌తో పాటు కారం రవీందర్‌రెడ్డిని టీఎస్‌పీఎస్‌సీ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఇక బి.జనార్దన్‌రెడ్డి గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే.
Published date : 19 May 2021 01:03PM

Photo Stories