Skip to main content

కొలువుదీరిన టీఎస్‌పీఎస్సీ కోరం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నూతన చైర్మన్‌గా బి.జనార్దన్‌రెడ్డి కొలువుదీరారు.
ఇప్పటివరకు యాక్టింగ్‌ చైర్మన్‌గా కొనసాగిన సీహెచ్‌ సాయిలు నూతన చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించారు.

జనార్దన్‌రెడ్డితోపాటు ఏడుగురు నూతన సభ్యులు రమావత్‌ ధన్‌సింగ్, బి.లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్ర ఆనంద్‌ తనోబా, కారెం రవీందర్‌రెడ్డి, అరవెల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్‌.సత్య నారాయణ చార్జ్‌ తీసుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన టీఎస్‌పీఎస్సీకి మొదటి చైర్మన్‌గా గంటా చక్రపాణి సేవలందించారు. ఆ తర్వాత డి.కృష్ణారెడ్డి, సీహెచ్‌ సాయిలు యాక్టింగ్‌ చైర్మన్‌గా వ్యవహరించారు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1,2,3,4 లకు సంబంధించిన స్టడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్స్, ఆన్‌లైన్‌ కోచింగ్‌ క్లాసులు, ప్రాక్టీస్‌ టెస్ట్స్, రిఫరెన్స్‌ బుక్స్‌... ఇతర అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.
Published date : 22 May 2021 02:22PM

Photo Stories