Skip to main content

TS Inter Advanced Supplementary Exams Result Link : ఇంట‌ర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల‌ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్ కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల‌ ఫలితాలను విడుద‌ల చేశారు.
TS Inter Advanced Supplementary Exams 2022

ఈ ఫ‌లితాల‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్ ఉద‌యం 9:30 గంట‌ల‌కు విడుద‌ల చేశారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు ఈ ఇంట‌ర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జ‌రిగిన విష‌యం తెల్సిందే.ఎంసెట్ కౌన్సెలింగ్ సౌల‌భ్యం కోసం ఈ ఫ‌లితాల‌ను ముందుగా విడుద‌ల చేశారు. తెలంగాణ ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప‌రీక్షల ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) లో చూడొచ్చు.

టీఎస్‌ ఇంట‌ర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (జ‌న‌ర‌ల్‌)

టీఎస్‌ ఇంట‌ర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (వొకేషనల్‌)

How to check TS Inter 2nd year Advanced Supplementary Exams 2022 Results :
➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS Inter 2nd year Advanced Supplementary results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference.

☛ Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

ఎంత మంది పాస్ అయ్యారంటే..
ఈ ఫలితాల్లో 48,816 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 47.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం 1,02,236 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.  వొకేషన్‌లో 12,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. ఇందులో 7,843 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం  65.07గా నమోదైంది.

రీకౌంటింగ్‌కు చివ‌రి తేదీ ఇదే..
సెప్టెంబర్‌ 5 నుంచి 8 వరకు రీకౌంటింగ్‌కు ఇంటర్‌ బోర్డు అవకాశం కల్పించింది. మరో వైపు ఇవాళ సాయంత్రం ఇంటర్‌ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు పేర్కొంది.

సప్లిమెంటరీ పరీక్షలు రాసిన 1.13 లక్షల మంది..
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వార్షిక పరీక్షలతో సంబంధం లేకుండా ఎంసెట్‌కు హాజరవుతారు. అయితే ఇప్పటికే ఎంసెట్‌ ఫలితాలు ప్రకటించి, కౌన్సెలింగ్‌ ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇంటర్‌ ఫెయిల్‌ అయి, సప్లిమెంటరీ పరీక్షలు రాసిన 1.13 లక్షల మంది విద్యార్థులు ఫలితాలు రాకపోవడంతో తొలిదశ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫలితాలు విడుదల చేశారు ఇంటర్‌ బోర్డు అధికారులు.

టీఎస్ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీల్లో మార్పులు ఇవే..?
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల కోసం నిరీక్షిస్తున్న వారికి ఉన్నత విద్యామండలి ఎంసెట్‌కు హాజరయ్యే అవకాశం కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. వాస్తవానికి సెప్టెంబర్‌ 6న ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈ కారణంగా సప్లిమెంటరీ రాసిన విద్యార్థులు తొలిదశ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్‌, ఆప్షన్ల నమోదు తేదీలను పొడిగించాలని నిర్ణయించారు. ఉన్నత విద్యామండలి అధికారులు మంగళవారం సమావేశమైన అధికారిక నిర్ణయం తీసుకునే వీలుంది.

Best Branch in Engineering : Btechలో బెస్ట్ బ్రాంచ్ ఏది..? ఎలా సెల‌క్ట్ చేసుకోవాలి..?

Published date : 30 Aug 2022 01:02PM

Photo Stories