Skip to main content

ఏపీ ట్రిపుల్ ఐటీ – 2021 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. సెప్టెంబర్ 26న పరీక్ష

వేంపల్లె: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు వైఎస్సార్ జిల్లా ఆర్జీయూకేటీ చాన్సలర్ చెంచురెడ్డి తెలిపారు.
సెప్టెంబర్‌ 26న ప్రవేశ పరీక్ష ఉంటుందని, దీని ద్వారా నాలుగు వేల సీట్లు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వంద మార్కులకు ఈ ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆగస్టు 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు www.rgukt.com ను సంప్రదించాలని చెంచురెడ్డి తెలిపారు.

ఆర్జీయూకేటీ సెట్ - 2021 మోడల్ పేపర్


చ‌ద‌వండి: క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాంలలో భారీ ఉద్యోగావకాశాలు.. వీరికి డిమాండ్‌ ఎక్కువ..
Published date : 19 Aug 2021 04:05PM

Photo Stories