Skip to main content

ఢిల్లీ ఎస్వీ కళాశాల గవర్నింగ్ బాడీ చైర్మన్‌గా వైవీ వైవీ సుబ్బారెడ్డి ఎంపిక

సాక్షి,అమరావతి: ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర కళాశాల గవర్నింగ్ బాడీ చైర్మన్‌గా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఎన్నుకున్నారు.
కోశాధికారిగా ఎఫ్‌ఏసీఏవో ఒ.బాలాజీ ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని వైవీ సుబ్బారెడ్డి నివాసం నుంచి మే 13వ తేదీన ఎస్వీ కళాశాల గవర్నింగ్ బాడీ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.హేమలతారెడ్డి మే 31 న ఉద్యోగ విరమణ చేయనుండటంతో ఆమె స్థానంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.పద్మాసురేష్‌ను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా నియమించారు. కళాశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలు ప్రారంభించడానికి గవర్నింగ్‌బాడీ అనుమతించింది. ఈ కాన్ఫరెన్స్ లో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, టీటీడీ బోర్డు సభ్యులు, కళాశాల గవర్నింగ్ బాడీ సభ్యులు డాక్టర్ సుధా నారాయణమూర్తి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డా.ఎం.నిశ్చిత, డీపీ అనంత, డా.బి.పార్థసారథిరెడ్డి పాల్గొన్నారు.
Published date : 14 May 2020 05:41PM

Photo Stories