న్యాయ కళాశాలల్లో ప్రవేశానికి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన లాసెట్ జూలై 22న ముగిసింది.
82 శాతం హాజరు.. కీ, ఫలితాల సమాచారం..
ఈ పరీక్షకు మొత్తం 82.46 శాతం హాజరైనట్టు LAWCET కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. 21వ తేదీన నిర్వహించిన మూడేళ్ల లాసెట్కు 20,107 మంది హాజరయ్యారు. జూలై 21న నిర్వహించిన ఐదేళ్ల లాసెట్కు 6,207 మంది, పీజీ లాసెట్కు 2,607 మంది హాజరయ్యారు. మొత్తం 28,921 మంది ఈ ఏడాది లాసెట్ పరీక్షలు రాసినట్టు తెలిపారు. జూలై 26వ తేదీన ప్రాథమిక కీని జ్టి్టpట:// ్చఠీఛ్ఛ్టి.్టటఛిజ్ఛి.్చఛి.జీn వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతా మని స్పష్టం చేశారు. అభ్యర్థులు జూలై 28వ తేదీలోగా అభ్యంతరాలు నమోదు చేయాలని సూచించారు. ఆగస్టు మొదటి వారంలో లాసెట్ ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.