Skip to main content

JEE Main 2024 Results: జేఈఈ మెయిన్‌ ఫలితాలు.. 56 మందికి 100% స్కోరు

న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 56 మంది అభ్యర్థులు ఏకంగా నూటికి నూరు మార్కులు సాధించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఏప్రిల్ 24న‌ తెలిపింది.
Jee Main Results 2024

వందకు వంద మార్కులు స్కోర్‌ చేసిన వీరిలో తెలంగాణ విద్యార్థులు అత్యధికంగా 15 మంది ఉండటం విశేషం. ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన ఏడుగురు చొప్పున, ఢిల్లీ విద్యార్థులు ఆరుగురు ఉన్నారు.

జేఈఈ మొదటి ఎడిషన్‌ పరీక్ష జనవరి–ఫిబ్రవరిలో, రెండో విడత ఏప్రిల్‌లో జరిగింది. ఈ రెండు పరీక్షల్లో ఫలితాలను బట్టి జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దేశంలోని ప్రఖ్యాత 23 ఐఐటీల్లో ప్రవేశాలకు ఈ పరీక్షే ప్రధానం. 

>> JEE(Main) 2024 Session-2 : Click Here to Access the Score Card

చదవండి:

TS ఎంసెట్‌ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

AP EAPCET - గైడెన్స్ | న్యూస్ | ఎంసెట్

Published date : 25 Apr 2024 12:16PM

Photo Stories