JEE Main 2024 Results: జేఈఈ మెయిన్ ఫలితాలు.. 56 మందికి 100% స్కోరు
Sakshi Education
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 56 మంది అభ్యర్థులు ఏకంగా నూటికి నూరు మార్కులు సాధించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఏప్రిల్ 24న తెలిపింది.
![Jee Main Results 2024](/sites/default/files/images/2024/04/25/jeemainresults2024-1714027576.jpg)
వందకు వంద మార్కులు స్కోర్ చేసిన వీరిలో తెలంగాణ విద్యార్థులు అత్యధికంగా 15 మంది ఉండటం విశేషం. ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన ఏడుగురు చొప్పున, ఢిల్లీ విద్యార్థులు ఆరుగురు ఉన్నారు.
జేఈఈ మొదటి ఎడిషన్ పరీక్ష జనవరి–ఫిబ్రవరిలో, రెండో విడత ఏప్రిల్లో జరిగింది. ఈ రెండు పరీక్షల్లో ఫలితాలను బట్టి జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దేశంలోని ప్రఖ్యాత 23 ఐఐటీల్లో ప్రవేశాలకు ఈ పరీక్షే ప్రధానం.
>> JEE(Main) 2024 Session-2 : Click Here to Access the Score Card
చదవండి:
TS ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
Published date : 25 Apr 2024 12:16PM