APPSC Group-2 Jobs 2023 : సాక్షి మీడియా గ్రూప్ , ఆర్.సి ఎగ్జామ్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులో గ్రూప్–2 ఉద్యోగ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు
![APPSC Group 2 Coaching and Guidance News in Telugu](/sites/default/files/images/2023/06/29/students-seminar-1688034035.jpg)
➤ జూలై 2వ తేదీ (ఆదివారం) ఉదయం 09:00 నుంచి 12:30 వరకు
➤ టాలెంట్ టెస్ట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రామాణిక స్టడీ మెటీరియల్
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దాదాపు 1000 వరకు గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో.. గ్రామీణ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో.. సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com) రాష్ట్రంలోని ప్రముఖ పోటీ పరీక్షల సంస్థ ఆర్.సి ఎగ్జామ్స్ కలిసి జూలై 2వ తేదీ (ఆదివారం) ఉదయం 09:00 నుంచి 12:30 వరకు గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం, హిందూ కాలేజ్ ఎదురుగా, మార్కెట్ సెంటర్ నందు ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు సాక్షిఎడ్యుకేషన్.కామ్ తోడుగా ఉంటున్న విషయం మీ అందరికి తెల్సిందే.
త్వరలోనే వెయ్యికి పైగా గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుండటం.. దీనికి తోడు గ్రూప్–2కు కొత్త సిలబస్ను ప్రకటించిన నేపథ్యంలో ఈ అవగాహన సదస్సులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. అవగాహన సదస్సు, టాలెంట్ టెస్ట్ కు హాజరయ్యే విద్యార్థులు ముందుగా 8985094499 ఫోన్ నెంబర్కు తమ పేరు, ఫోన్ నెంబర్, జిల్లా వివరాలను వాట్సప్లో పంపాలి.
అవగాహన సదస్సు తేదీ : జూలై 2, 2023 (ఆదివారం)
వేదిక: శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం, హిందూ కాలేజ్ ఎదురుగా, మార్కెట్ సెంటర్, గుంటూరు
సమయం : ఉదయం 09:00 నుంచి 12:30 వరకు