Skip to main content

జ్ఞానపీఠ్ పురస్కారం-2019

సాహిత్యరంగంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ ప్రముఖ మలయాళీ కవి అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రిని వరించింది.
అక్కితమ్‌ను 55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికచేసినట్లు జ్ఞానపీఠ్ ఎంపిక బోర్డు చైర్మన్ ప్రతిభా 2019, నవంబర్ 29న ప్రకటించారు. మలయాళ సాహితీవేత్తల్లో ప్రముఖుడైన అక్కితమ్ కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గల కుమారనెల్లూర్‌లో 1926, మార్చి 18న జన్మించారు. అక్కితమ్ కవితలతోపాటు నాటకాలు, విమర్శనాత్మక వ్యాసాలు, పిల్లల సాహిత్యం, కథలు, అనువాదాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇప్పటి వరకు 55 పుస్తకాలు రాశారు. మలయాళీ సాహిత్యంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ అవార్డు అందించింది. సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, కబీర్ సమ్మాన్ వంటి పురస్కారాలను అక్కితమ్ అందుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపిక
ఎప్పుడు : 2019, నవంబర్ 29
ఎవరు : అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రి
 
జ్ఞానపీఠ్ గురించి...
మనదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారం.. జ్ఞాన్‌పీఠ్. దీన్ని ఏటా భారతీయ జ్ఞాన్‌పీఠ్ సంస్థ ప్రదానం చేస్తోంది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషలకు సంబంధించిన సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును అందిస్తారు. మొదటి అవార్డును 1965లో ప్రదానం చేశారు. 1965 నుంచి 1981 వరకు ఒక పుస్తకానికి జ్ఞాన్‌పీఠ్ పురస్కారం ఇచ్చేవారు. 1982 నుంచి ఒక పుస్తకానికి కాకుండా సాహితీ రంగంలో చేసిన సేవకు ఇవ్వడం ప్రారంభించారు. అవార్డు గ్రహీతలకు రూ.11 లక్షల నగదు, సరస్వతీ దేవి కాంస్య విగ్రహం ప్రదానం చేస్తారు.
  • తొలి జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత మలయాళ రచయిత జి.శంకర కురుప్ (1965). ‘ఒదక్కుజల్’ అనే పుస్తకానికి ఈ అవార్డు లభించింది.
  • జ్ఞాన్‌పీఠ్ అవార్డును అందుకున్న తొలి మహిళ బెంగాలీ రచయిత్రి ఆశాపూర్ణాదేవి (1976). ఆమె రాసిన ‘ప్రథమ్ ప్రతిశ్రుతి’ అనే నవలకు ఈ అవార్డు లభించింది. ఇప్పటి వరకు ఎనిమిది మంది మహిళలకు జ్ఞాన్‌పీఠ్ అవార్డును బహూకరించారు.

తెలుగు రచయితలు
ఇప్పటి వరకు ముగ్గురు తెలుగు రచయితలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వారు..
విశ్వనాథ సత్యనారాయణ (1970)
సి.నారాయణరెడ్డి (1988)
రావూరి భరద్వాజ (2012)
 
‘జ్ఞాన్‌పీఠ్’ గ్రహీతలు
సంవత్సరం
గ్రహీత
భాష
1965
జి.శంకర కురుప్
మలయాళం
1966
తారాశంకర్ బందోపాధ్యాయ
బెంగాలీ
1967
ఉమాశంకర్ జోషి
గుజరాతీ
1967
కుప్పాలి వెంకటప్ప పుట్టప్ప (కువెంపు)
కన్నడ
1968
సుమిత్రానందన్ పంత్
హిందీ
1969
ఫిరాఖ్ గోరఖ్‌పురి
ఉర్దూ
1970
విశ్వనాథ సత్యనారాయణ
తెలుగు
1971
బిష్ణు డే
బెంగాలీ
1972
రాంధారి సింగ్ దిన్‌కర్
హిందీ
1973
డి.ఆర్.బెంద్రె
కన్నడ
1973
గోపీనాథ్ మొహంతి
ఒడియా
1974
విష్ణు సఖరాం ఖండేకర్
మరాఠీ
1975
అఖిలన్
తమిళ్
1976
ఆశాపూర్ణాదేవి
బెంగాలీ
1977
కె.శివరాం కారంత్
కన్నడ
1978
సచ్చిదానంద వాత్సాయన్
హిందీ
1979
బీరేంద్ర కుమార్ భట్టాచార్య
అస్సామీస్
1980
ఎస్.కె.పొట్టెక్కాట్
మలయాళం
1981
అమృతా ప్రీతమ్
పంజాబీ
1982
మహాదేవి వర్మ
హిందీ
1983
మాస్తి వెంకటేశ అయ్యంగార్
కన్నడ
1984
తక్కజి శివశంకర పిళ్లై
మలయాళం
1985
పన్నాలాల్ పటేల్
గుజరాతీ
1986
సచ్చిదానంద రౌత్రాయ్
ఒడియా
1987
విష్ణువామన్ శిర్వాద్కర్ (కుసుమాగ్రజ్)
మరాఠీ
1988
సి.నారాయణరెడ్డి
తెలుగు
1989
ఖుర్రత్‌లేన్ హైదర్
ఉర్దూ
1990
వినాయక కృష్ణ గోకాక్
కన్నడ
1991
సుభాష్ ముఖోపాధ్యాయ
బెంగాలీ
1992
నరేష్ మెహతా
హిందీ
1993
సీతాకాంత్ మహాపాత్ర
ఒడియా
1994
యు.ఆర్.అనంతమూర్తి
కన్నడ
1995
ఎం.టి.వాసుదేవన్ నాయర్
మలయాళం
1996
మహాశ్వేతాదేవి
బెంగాలీ
1997
అలీ సర్దార్ జాఫ్రి
ఉర్దూ
1998
గిరీష్ కర్నాడ్
కన్నడ
1999
నిర్మల్ వర్మ
హిందీ
1999
గురుదయాళ్ సింగ్
పంజాబీ
2000
ఇందిరా గోస్వామి
అస్సామీస్
2001
రాజేంద్ర షా
గుజరాతీ
2002
జయకాంతన్
తమిళ్
2003
విందా కరాందికర్
మరాఠీ
2004
రెహమాన్ రాహి
కశ్మీరీ
2005
కున్వర్ నారాయణ్
హిందీ
2006
రవీంద్ర కెలేకర్
కొంకణి
2006
సత్యవ్రత్ శాస్త్రి
సంస్కృతం
2007
ఒ.ఎన్.వి.కురుప్
మలయాళం
2008
అక్లాఖ్ మహమ్మద్ ఖాన్
ఉర్దూ
2009
అమర్ కాంత్
హిందీ
2009
శ్రీ‌లాల్ శుక్లా
హిందీ
2010
చంద్రశేఖర కంబర
కన్నడ
2011
ప్రతిభా రే
ఒడియా
2012
రావూరి భరద్వాజ
తెలుగు
2013
కేదార్‌నాథ్ సింగ్
హిందీ
2014
బాలచంద్ర నెమాడే
మరాఠీ
2015
రఘువీర్ చౌదరి
గుజరాతీ
2016
శంఖ ఘోష్
బెంగాలీ
2017
కృష్ణ సోబతీ
హిందీ

2018    

         అమితావ్ ఘోష్‌       

   ఆంగ్లం

Published date : 30 Nov 2019 06:11PM

Photo Stories