Skip to main content

ఇంజనీరింగ్ విద్యార్థులకు ‘యూఐ పాత్’ శిక్షణ

సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రముఖ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్‌పీఏ) సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘యుఐ పపాత్’, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మధ్య ఎంవోయూ కుదిరింది.
ఏడాది వ్యవధిలో 50 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్లు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదనరెడ్డి తెలిపారు.

3వ ఏడాది విద్యార్థుల కోసం....
  • డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఇంజనీరింగ్ 3వ ఏడాది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను మెరుగుపరుస్తామని చల్లా మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాథమిక స్ధాయిలోనే ఆర్‌పీఏ విద్యను అందుబాటులోకి తేవడం ద్వారా డిజిటల్ వర్క్‌ఫోర్స్ నిర్మాణం ఆరంభమవుతుందన్నారు.
  • ఆర్‌పీఏకు డిమాండ్ పెరుగుతున్నందున పెద్ద ఎత్తున విద్యా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ అర్జా శ్రీకాంత్ చెప్పారు.

సగం రాయితీతో సర్టిఫికెట్లు...
  • అధ్యాపకులు, విద్యార్థులు 50 శాతం రాయితీతో యుఐ పాత్ సర్టిఫైడ్ గ్లోబల్ సర్టిఫికెట్లు పొందవచ్చని సంస్ధ ఇండియా చైర్మన్ భారతి తెలిపారు. నూతన ఆటోమేషన్ యుగానికి అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడం, ఐటీలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో కెరీర్ నిర్మాణం లక్ష్యంతో పని చేస్తున్నట్లు వివరించారు.
  • దేశవ్యాప్తంగా 200కిపైగా స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో లక్ష మందికిపైగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

వివరాలు ఇలా తెలుసుకోవచ్చు..
యూఐ పాత్ సర్టిఫైడ్ కోర్సుల గురించి మరింత సమాచారం కోసం www.uipath.com/academicalliance, www.uipath.com/certification  వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. 92463 71566, 81250 71566 ఫోన్ నంబర్లలో కూడా సంప్రదించవచ్చు.
Published date : 08 Sep 2020 06:58PM

Photo Stories