Skip to main content

Tata IPL 2022: ఐపీఎల్‌ భాగస్వామిగా వ్యవహరించనున్న పేమెంట్‌ నెట్‌వర్క్‌?

Rupay-IPL

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 సీజన్‌కు ‘రూపే’ అధికారిక భాగస్వామిగా వ్యవహరించనుంది. ఇది ఒకటికి మించిన సంవత్సరాల భాగస్వామ్యంగా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) పేర్కొంది. టాటా ఐపీఎల్‌ 2022 సీజన్‌కు అధికారిక పార్ట్‌నర్‌గా రూపేను ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మార్చి 3న ప్రకటించింది. ఐపీఎల్‌ 2022 సీజన్‌ మార్చి 26 నుంచి మే 29 వరకు జరగనుంది. ఎన్‌పీసీఐ అభివృద్ధి చేసిన ‘రూపే నెట్‌వర్క్‌’ ఏకైక దేశీ పేమెంట్‌ నెట్‌వర్క్‌. ఆత్మనిర్భర్‌ కార్యక్రమంలో భాగంగా దీన్ని ఆవిష్కరించారు. ఎన్‌పీసీఐ ప్రధాన కార్యాలయం భారత ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఉంది.

Chess: సీనియర్‌ జాతీయ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ సాధించిన ఆటగాడు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 సీజన్‌కు అధికారిక భాగస్వామిగా వ్యవహరించనున్న పేమెంట్‌ నెట్‌వర్క్‌?
ఎప్పుడు : మార్చి 3
ఎవరు    : ఎన్‌పీసీఐ అభివృద్ధి చేసిన రూపే నెట్‌వర్క్‌
ఎందుకు : ఎన్‌పీసీఐ, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 04 Mar 2022 04:58PM

Photo Stories