Skip to main content

Suresh Raina Retires: క్రికెట్‌కు రైనా వీడ్కోలు

భారత మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా స్వదేశంలో జరిగే అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్‌ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు సెప్టెంబర్ 7 న ప్రకటించాడు.
Suresh Raina retires from all forms of cricket
Suresh Raina retires from all forms of cricket

విదేశాల్లో జరిగే టి20 లీగ్‌లలో పాల్గొనేందుకు అర్హుడవుతాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన రైనా దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2021లో చివరిసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తరఫున ఐపీఎల్‌ టోర్నీలో ఆడిన రైనాను ఈ ఏడాది ఐపీఎల్‌ మెగా వేలంలో ఏ జట్టూ తీసుకోలేదు. 2008 నుంచి 2021 వరకు వరుసగా 13 ఐపీఎల్‌ సీజన్‌లు ఆడిన రైనా మొత్తం 205 మ్యాచ్‌లు ఆడి 5,528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బెట్టింగ్‌ ఆరోపణలపై చెన్నై సూపర్‌ కింగ్స్‌పై రెండేళ్ల నిషేధం విధించిన సమయంలో రైనా 2016, 2017 ఐపీఎల్‌ టోర్నీలలో గుజరాత్‌ లయన్స్‌ తరఫున ఆడాడు.

Also read: Weekly Current Affairs (Persons) Bitbank: కెన్యా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 07 Sep 2022 04:11PM

Photo Stories