Tennis: ఏఐటీఏ టోర్నీ రన్నరప్ నైశిక్ రెడ్డి జోడీ
Sakshi Education
అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) జాతీయ అండర్–18 ర్యాంకింగ్ సిరీస్ టోర్నీలో జి.నైశిక్ రెడ్డి (తెలంగాణ)–ప్రణవ్ కొరాడె (మహారాష్ట్ర) జోడీ రన్నరప్గా నిలిచింది.
బాంబే జింఖానా క్లబ్లో మే 12న జరిగిన బాలుర డబుల్స్ ఫైనల్లో నైశిక్ రెడ్డి–ప్రణవ్ ద్వయం 4–6, 2–6తో శ్రీనికేత్ కన్నన్ (కర్ణాటక)–ఒమర్ సుమర్ (మహారాష్ట్ర) జంట చేతిలో ఓడిపోయింది. నైశిక్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులోని పడుకోన్–ద్రవిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్లో అమెరికాకు చెందిన కోచ్ సీజర్ మొరాలెస్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (09-15 ఏప్రిల్ 2023)
Published date : 13 May 2023 12:04PM