ఈ క్రమంలో టెస్టుల్లో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. విండీస్తో రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్లో భారత జట్టు కేవలం 12.2 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ను అందుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. 2001లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్టులో శ్రీలంక 13.2 ఓవర్లలో వంద పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో శ్రీలంక రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది.