Skip to main content

Hardik Pandya to captain India in Ireland T20Is : ఐర్లాండ్‌తో టి20లకు భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా

Hardik Pandya to captain India in Ireland T20Is

ఐర్లాండ్‌తో ఈ నెల 26, 28 తేదీల్లో జరిగే రెండు టి20 మ్యాచ్‌ల కోసం 17 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ జూన్‌  15(బుధవారం) ప్రకటించింది. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను విజేతగా నిలిపిన హార్దిక్‌ పాండ్యాకు తొలిసారి భారత జట్టు సారథ్య బాధ్యతలు దక్కడం విశేషం. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున రాణించిన రాహుల్‌ త్రిపాఠి మొదటిసారి టీమిండియాకు ఎంపిక కాగా... సామ్సన్, సూర్యకుమార్‌ పునరాగమనం చేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్‌లో కెప్టెన్‌గా ఉన్న పంత్, బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌లు టెస్టు జట్టులో సభ్యులు కావడంతో వారిని ఎంపిక చేయలేదు.   

Published date : 16 Jun 2022 07:13PM

Photo Stories